నాకు తెలుగు బాషన్న, రచనలన్న చాల అభిమానం. మంచి సాహిత్యం వున్నా పాటలంటే చెవి కోసుకున్తాననుకోండి. ఈ మధ ఒక రాత్రి నా బుర్రలో కవితా త్రిష్ణ పెరిగి ఏదో రెండు కవితలు కెలికాను. నేను ఏదో మా ఆవిడను (తనకు తెలుగు చదవటం తప్ప వ్రాయటం రాదు మరియు సెంట్రల్ స్కూల్ చదువు) మాయ చెయ్యటానికి కాలేజీ లో కొన్ని వ్రాసాను. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత కొంచం యాంత్రికమైన జీవితం లో మార్పు తేవాలని సాహిత్యం చదవటం చేస్తున్నాను. ఆ వూపులో వ్రాసిన రెండు కవితలు. పొరపాటున ఎవరైనా చదివితే మీ అభిప్రాయాని తప్పకుండా చెప్పండేం...
జోలపాట
అయ్యో...
ఆ బిడ్డడు...
అలా ఎడుస్తున్నాదేంటి?
"ఒసే ఎంకినీ బిడ్డ ఏడుస్తున్నాడు"
"వత్తనానమ్మగోరు"
జానకి ఆలపిస్తోంది...
శ్రావ్యంగా...
ఇళయరాజా గారి బానీ కి...
"వటపత్ర సాయి కి..." అంటూ
"ఏంటే ఎంకి?"
"ఇంత మంచి పాట వస్తోంటే నీ బిడ్డ ఎడుస్తున్నాదేంటి?"
"వూరుకో బిడా...మియమ్మన్రా...వూరుకో నేనోచేసా"
అరె!!!
దుడ్డ్లు
ఏం దుడ్లియ్యి?
ఇంత మాయ జేసినాయి?
మా అమ్మ, అయ్యా అక్కడ,
మా తమ్ముదింకో దిక్కున,
నేను, నా పెండ్లామిక్కడ.
కన్నేందుకు అన్నట్లు,
వారానికి ఒగాసారి,
ఫోనులో మాటలు.
ఎమిబ్బందోచ్చినా
ఎవురి బాదలోల్లయ్యి
ఏం బతుకిది
ఇంతన్నాయమైపోయింది
ఆ సేద్దేమే బాగుండేది
అందరం గలిసి,
అందరికోసమన్నిట్లున్తిమి
ఏం దుడ్లియ్యి?
ఇంట మాయ జేసినాయి?
గంగమ్మ కాదు....
2 months ago
